మే 2న కుమార్తెకు పెళ్లి... ఇంతలోనే కరోనాతో తల్లిదండ్రులు మృతి!

ABN , First Publish Date - 2021-04-17T16:46:31+05:30 IST

కరోనా మహమ్మారి పలువురి జీవితాల్లోని ఆనందాన్ని హరింపజేస్తోంది.

మే 2న కుమార్తెకు పెళ్లి... ఇంతలోనే కరోనాతో తల్లిదండ్రులు మృతి!

లక్నో: కరోనా మహమ్మారి పలువురి జీవితాల్లోని ఆనందాన్ని హరింపజేస్తోంది. యూపీలోని బరేలీ కాలేజీలో పనిచేస్తున్న అసోసియేట్ ప్రొఫెసర్ భారతేందు శర్మ ఇంటిలో అతని కుమార్తె వివాహ వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ ఆనందం మూడునాళ్ల ముచ్చటేనని వారు గ్రహించలేపోయారు. ముందుగా ప్రొఫెసర్ భారతేందు భార్యకు కరోనా సోకి మృతి చెందారు.


మూడు రోజుల తరువాత భారతేందు శర్మ కరోనాతో కన్నుమూశారు. తల్లిదండ్రులు రోజుల వ్యవధిలోనే మృతి చెందడంతో వారి పిల్లలు అనాథలుగా మారారు. వివరాల్లోకి వెళితే బరేలీ కాలేజీలో కామర్స్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ భారతేంద్రు శర్మ కుమార్తెకు మే 2న వివాహం నిశ్చయమయ్యింది. ఆమె కనక్ బ్యాంకులో పీఓగా పనిచేస్తున్నారు. కుటుంబమంతా వివాహం కోసం ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఏప్రిల్ 7న డాక్టర్ భారతేంద్రు శర్మతో పాటు అతని భార్య అర్చనా శర్మ కూడా కోవిడ్ బారినపడి, పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేరారు. తరువాత ఇద్దరూ చికిత్స పొందుతూ కన్నుమూశారు.  డాక్టర్ భారతేంద్రు శర్మ కుమారుడు శరత్ శర్మ ఎల్ఎల్బీ పూర్తి చేసి, సివిల్ సర్వీస్ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. 

Updated Date - 2021-04-17T16:46:31+05:30 IST