‘సిరి’మహాలక్ష్మి

ABN , First Publish Date - 2022-10-01T06:09:18+05:30 IST

శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా వన్‌టౌన్‌ ప్రాంతంలోని కన్యకాపరమేశ్వరి అమ్మవారు శుక్రవారం స్వర్ణ వస్త్ర సహిత అలంకరణలో శ్రీమహాలక్ష్మిగా దర్శనమిచ్చారు.

‘సిరి’మహాలక్ష్మి

శ్రీమహాలక్ష్మిగా కన్యకాపరమేశ్వరి దర్శనం

ఆరు కిలోల స్వర్ణాభరణాలు, రూ.3.5 కోట్ల కరెన్సీతో అలంకరణ


శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా వన్‌టౌన్‌ ప్రాంతంలోని కన్యకాపరమేశ్వరి అమ్మవారు శుక్రవారం స్వర్ణ వస్త్ర సహిత అలంకరణలో శ్రీమహాలక్ష్మిగా దర్శనమిచ్చారు. అమ్మవారిని సుమారు ఆరు కిలోల స్వర్ణాభరణాలు, బంగారు బిస్కెట్‌లు, రూ.మూడున్నర కోట్ల నగదుతో అలంకరించారు. 108 స్వర్ణ పుష్పాలతో అమ్మవారికి నివేదన చేశారు. కాగా శనివారం అమ్మవారు పుష్పనయన సుందరి రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.                       

- మహారాణిపేట

Updated Date - 2022-10-01T06:09:18+05:30 IST