అసెంబ్లీలో టీడీపీ ప్రవర్తన తలదించుకునేలా ఉంది: కాపు రామచంద్రారెడ్డి

ABN , First Publish Date - 2022-03-23T20:29:22+05:30 IST

అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ప్రవర్తన ప్రజాప్రతినిధులుగా తలదించుకునేలా ఉందని ప్రభుత్వ విప్ అన్నారు.

అసెంబ్లీలో టీడీపీ ప్రవర్తన తలదించుకునేలా ఉంది: కాపు రామచంద్రారెడ్డి

అమరావతి: అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ప్రవర్తన ప్రజాప్రతినిధులుగా తలదించుకునేలా ఉందని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ రోజు రోజుకీ అసెంబ్లీలో వారి ప్రవర్తన దిగజారుతోందని విమర్శించారు. నిన్న విజిల్స్.. ఇవాళ చిడతలు, తాళాలు వాయిస్తూ టీడీపీ సభ్యులు అల్లరి చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ అనేది టీడీపీ ఒక్కరిదే కాదని, 175 మంది సభ్యులదన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. టీడీపీ నీచ రాజకీయాలకు స్వస్తి చెప్పకపోతే.. ప్రజలే వారికి తగిన గుణపాఠం చెబుతారని కాపు రామచంద్రారెడ్డి అన్నారు.

Updated Date - 2022-03-23T20:29:22+05:30 IST