మేయర్గా కాపు మహిళకు అవకాశం ఇవ్వాలి
ABN , First Publish Date - 2021-02-28T07:22:22+05:30 IST
రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో మేయర్గా కాపు మహిళకు అవకాశం కల్పించాలని కాపునాడు నేతలు ఆయా రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు.
రాజకీయ పార్టీలకు కాపునాడు నేతల విజ్ఞప్తి
విజయవాడ సిటీ : రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో మేయర్గా కాపు మహిళకు అవకాశం కల్పించాలని కాపునాడు నేతలు ఆయా రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. స్థానిక గాంధీనగర్లోని బెజవాడ మీడియా సెంటర్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న కాపు విద్యార్థులకు రెండో విడత ఆర్థికసాయం విడుదల చేయాలన్నారు. కాపునేస్తం ద్వారా మహిళలకు ఇస్తున్న రూ.15వేలను కార్పొరేషన్ నుంచి కాకుండా నేరుగా ఇవ్వాలన్నారు. కాపునాడు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గాళ్ల సుబ్రమణ్యం, శిఖరం ఈశ్వర్కృష్ణ, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కృష్ణప్రసన్న, అర్బన్ అధ్యక్షుడు కేతినేడి భాస్కర్కుమార్ పాల్గొన్నారు.