వీరారాధన ఉత్సవాలకు శ్రీకారం
ABN , First Publish Date - 2020-11-30T04:40:28+05:30 IST
కార్తీక అమావాస్య నుంచి ఐదు రోజులపాటు నిర్వహించే వీరారాధన ఉత్సవాలకు ఆదివారం పీఠాధిపతి పిడుగు తరుణ్ కేన్నకేశవ అయ్యవారు వీర్ల దేవాలయంలో పోతురాజు శిలకు 101 పోగుతో పడిగం కట్టి శ్రీకారం చుట్టారు.
కారంపూడి, నవంబరు 29: కార్తీక అమావాస్య నుంచి ఐదు రోజులపాటు నిర్వహించే వీరారాధన ఉత్సవాలకు ఆదివారం పీఠాధిపతి పిడుగు తరుణ్ కేన్నకేశవ అయ్యవారు వీర్ల దేవాలయంలో పోతురాజు శిలకు 101 పోగుతో పడిగం కట్టి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పీఠాధిపతి మాట్లాడుతూ డిసెంబర్ 13వ తేదీన రాచగావు, 14న రాయబారం, 15 మందపోరు, 16న కోడిపోరు, 17న కల్లిపాడు పేర్లతో ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఊరేగింపుల్లో 100 మందికి మించకుండా నిర్వహిస్తామని, అన్ని కార్యక్రమాలు యథావిధిగా జరుపుతామని చెప్పారు.