నేషనల్ ఓపెన్ కరాటే పోటీలు ప్రారంభం
ABN , First Publish Date - 2021-11-29T05:56:43+05:30 IST
నేషనల్ ఓపెన్ కరాటే పోటీలు ప్రారంభం
భవానీపురం, నవంబరు 28 : జేకే కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నేషనల్ ఓపెన్ కరాటే చాంపియన్షిప్ ఊర్మిళానగర్లోని శక్తి గ్రీన్స్ కన్వెన్షన్ ఇన్లో ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్, నేషనల్ కరాటే అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రజనీష్ చౌదరి ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా క్రీడాకారులు పోటీ పడ్డారు. ప్రత్యేక అతిథులుగా ఎస్సీఆర్ డిప్యూటీ సీఎంఈ కె.రవీంద్రనాథ్, ఎన్హెచ్ఆర్సీ చైర్మన్, ఎండీ పి.సంపత్కుమార్, డాక్టర్ ఎస్.వేణుగోపాల్, హైకోర్టు న్యాయవాది పాలేటి మహేశ్, 42వ డివిజన్ కార్పొరేటర్ పడిగపాటి చైతన్యరెడ్డి, జేకే అకాడమీ ఇన్చార్జి జంబూకం, ఇంటర్నేషనల్ ఇండియా చీఫ్ శ్రీనివాసులు పాల్గొన్నారు.