మాతో పెట్టుకోవద్దు

ABN , First Publish Date - 2021-04-21T07:38:52+05:30 IST

కర్ఫ్యూ సందర్భంగా బోయిన్‌పల్లిలో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులకు ఓ తండ్రీ కొడుకులు షాక్‌ ఇచ్చారు

మాతో పెట్టుకోవద్దు

షాక్‌ ఇచ్చిన తండ్రీ కొడుకులు 


బోయినపల్లి, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): కర్ఫ్యూ సందర్భంగా బోయిన్‌పల్లిలో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులకు ఓ తండ్రీ కొడుకులు షాక్‌ ఇచ్చారు. కర్ఫ్యూ సమయంలో బైకుపై వెళ్తున్న వారిని ఆపిన పోలీసులు ప్రశ్నించారు. తాము తండ్రీ కొడుకులమని, కొవిడ్‌ పేషెంట్లమని చెప్పారు. నిజం చెప్పండని గద్దించగా, రిపోర్టులు చూపెట్టారు. పోలీసులు వెంటనే వారిని వదిలేసి తమ చేతులను శానిటైజ్‌ చేసుకున్నారు. పాజిటివ్‌ వచ్చిన వారు రోడ్లపై తిరగొద్దని పోలీసులు సూచిస్తున్నారు. 

Updated Date - 2021-04-21T07:38:52+05:30 IST