కరీంనగర్ జిల్లా: భూ సర్వేను అడ్డుకున్న రైతులు

ABN , First Publish Date - 2022-01-19T21:24:28+05:30 IST

కరీంనగర్ జిల్లా: గంగాధర మండలం, రంగారావుపల్లెలో భూ సర్వేను రైతులు అడ్డుకున్నారు.

కరీంనగర్ జిల్లా: భూ సర్వేను అడ్డుకున్న రైతులు

కరీంనగర్ జిల్లా: గంగాధర మండలం, రంగారావుపల్లెలో భూ సర్వేను రైతులు అడ్డుకున్నారు. కాళేశ్వరం  మూడో టీఎంసీ కోసం తమ భూముల్ని ఇవ్వబోమని రైతులు తేల్చి చెప్పారు. భూ సర్వే చేసేందుకు వచ్చిన అధికారులు వెళ్లిపోవాలని నినాదాలు చేశారు. వారితో వాగ్వాదానికి దిగారు. భూ సర్వే చేయడానికి సహకరించాలని రైతుల్ని తహసీల్దార్ కోరారు. పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. భూ సర్వే చేయడానికి వీల్లేదని కాంగ్రెస్ నాయకులతో కలిసి పొలాల్లో బైఠాయించారు.

Updated Date - 2022-01-19T21:24:28+05:30 IST