కరీంనగర్‌లో రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2022-04-25T13:40:29+05:30 IST

జిల్లాలోని నగునూరు రుక్మపూర్ శివారులో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

కరీంనగర్‌లో రోడ్డు ప్రమాదం

కరీంనగర్: జిల్లాలోని నగునూరు రుక్మపూర్ శివారులో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. హార్వెస్టర్, కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

Updated Date - 2022-04-25T13:40:29+05:30 IST