కర్ణాటక మద్యం పట్టివేత

ABN , First Publish Date - 2021-12-03T05:01:19+05:30 IST

పట్టణంలోని ఆలూరు రోడ్డులో పెట్రోల్‌ బంక్‌ దగ్గర బుధవారం రాత్రి టూటౌన్‌ సీఐ శ్రీరాములు వాహనాలు తనిఖీ చేస్తుండగా స్కార్పియో వాహనంలో కర్ణాటక నుంచి అక్రమ మద్యాన్ని తీసుకువస్తుండగా దాడులు జరిపారు.

కర్ణాటక మద్యం పట్టివేత

ఆదోని, డిసెంబరు 2: పట్టణంలోని ఆలూరు రోడ్డులో పెట్రోల్‌ బంక్‌ దగ్గర బుధవారం రాత్రి టూటౌన్‌ సీఐ శ్రీరాములు వాహనాలు తనిఖీ చేస్తుండగా స్కార్పియో వాహనంలో కర్ణాటక నుంచి అక్రమ మద్యాన్ని తీసుకువస్తుండగా దాడులు జరిపారు. ఈ దాడులలో రూ.6 లక్షలు విలువ చేసే అక్రమ మద్యాన్ని, స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. గురువారం డీఎస్పీ వినోద్‌కుమార్‌ టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఆరేకల్లు గ్రామానికి చెందిన మేకల నరసయ్య, గుడ్డేకళ్లు గ్రామానికి చెందిన ఉరుకుందు కర్ణాటక నుంచి  అక్రమ మద్యం తీసుకొని వస్తున్నట్లు తెలిసి దాడి చేశామని అన్నారు.  ఈ ఇద్దరితోపాటు డ్రైవర్‌ సురేష్‌ను కూడా అరెస్టు చేశామని తెలిపారు. మరొక డ్రైవర్‌ పురుషోత్తం తప్పించుకున్నాడని తెలిపారు. 

Updated Date - 2021-12-03T05:01:19+05:30 IST