ఎమ్మెల్యేల జీతం 30 శాతం తగ్గింపు..కర్ణాటక అసెంబ్లీలో బిల్లు పాస్

ABN , First Publish Date - 2020-09-23T14:26:05+05:30 IST

కరోనా సంక్షోభం నేపథ్యంలో శాసనసభ్యుల జీతభత్యాల్లో 30 శాతం తగ్గిస్తూ కర్ణాటక అసెంబ్లీలో సర్కారు ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం లభించింది....

ఎమ్మెల్యేల జీతం 30 శాతం తగ్గింపు..కర్ణాటక అసెంబ్లీలో బిల్లు పాస్

బెంగళూరు (కర్ణాటక): కరోనా సంక్షోభం నేపథ్యంలో శాసనసభ్యుల జీతభత్యాల్లో 30 శాతం తగ్గిస్తూ కర్ణాటక అసెంబ్లీలో సర్కారు ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం లభించింది. ఎమ్మెల్యేల జీత, భత్యాలను 30 శాతం తగ్గించుకోవడం వల్ల 18 కోట్ల రూపాయలను ఆదా చేయవచ్చని కర్ణాటక శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి జేసీ మధుస్వామి చెప్పారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, స్పీకరు, డిప్యూటీ స్పీకర్ల జీతభత్యాల నుంచి 30 శాతం కోత విధించేలా బిల్లు తీసుకువచ్చామని మంత్రి వివరించారు. కాగా కరోనా ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వం న్యాయాధికారుల జీతాలను ఎలా పెంచిందని జేడీఎస్ ఎమ్మెల్యే రామస్వామి ప్రశ్నించారు. 

Updated Date - 2020-09-23T14:26:05+05:30 IST