ఢిల్లీకి హుటాహుటిన కర్ణాటక సీఎం

ABN , First Publish Date - 2022-05-20T22:05:03+05:30 IST

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు హుటాహుటిన ఢిల్లీకి..

ఢిల్లీకి హుటాహుటిన కర్ణాటక సీఎం

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. క్యాబినెట్ విస్తరణకు కేంద్ర నాయకత్వం నుంచి క్లియరెన్స్ కోసం కొద్ది నెలలుగా ఎదురుచూస్తున్న సీఎంకు గురువారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి పిలుపువచ్చినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలకు మందుగా క్యాబినెట్‌లో సంపూర్ణ మార్పులు జరగనున్నాయనే ఊహాగానాలు కొద్దికాలంగా బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో సీఎం ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. 2021లో సీఎంగా బొమ్మై పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఎనిమిది పర్యాయాలకు పైనే ఆయన ఢిల్లీకి వెళ్లారు. కాగా, కర్ణాటక క్యాబినెట్‌లో 34 మందికి అవకాశం ఉండగా, ప్రస్తుతం ఐదు ఖాళీలు ఉన్నాయి. ఈనెల 22న దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లాలనుకుంటున్న బొమ్మైకి దీనికి ముందే ఢిల్లీ నుంచి పిలుపురావడంతో కర్ణాటక పార్టీ వర్గాల్లో ఉత్సుకత నెలకొంది.

Updated Date - 2022-05-20T22:05:03+05:30 IST