కర్ణాటక మద్యం స్వాధీనం: ముగ్గురు అరెస్టు
ABN , First Publish Date - 2020-08-07T11:00:38+05:30 IST
కారులో తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని రామకుప్పం మండలం బూరగమాకులపల్లె వద్ద స్వాధీనంచేసుకున్నట్టు కుప్పం ఎక్సైజ్ సీఐ..
రామకుప్పం, ఆగస్టు 6: కారులో తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని రామకుప్పం మండలం బూరగమాకులపల్లె వద్ద స్వాధీనంచేసుకున్నట్టు కుప్పం ఎక్సైజ్ సీఐ చంద్రశేఖరఖనాయుడు తెలిపారు. కారుతోపాటు అందులోని 57 బాటిళ్లు, 197 టెట్రా ప్యాకెట్ల మద్యం సీజ్ చేశామన్నారు. ఐరాల మండలం నాగవాండ్లపల్లెకు గోపీ, ప్రదీప్కుమార్, దినేష్లను అరెస్టు చేశారు. ఎస్ఐలు రామమూర్తి, శివకృష్ణమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.