Karnataka:బాత్రూంలో గుండెపోటుతో మంత్రి మృతి
ABN , First Publish Date - 2022-09-07T13:06:43+05:30 IST
కర్ణాటక అటవీ, ఆహార, పౌర సరఫరాల శాఖ కేబినెట్ మంత్రి ఉమేష్ విశ్వనాథ్ కట్టి గుండెపోటుతో...
బెంగళూరు: కర్ణాటక(Karnataka) అటవీ, ఆహార, పౌర సరఫరాల శాఖ కేబినెట్ మంత్రి(minister) ఉమేష్ విశ్వనాథ్ కట్టి గుండెపోటుతో(cardiac arrest) మంగళవారం రాత్రి మరణించారు. బెల్గావి జిల్లాకు చెందిన ఉమేష్ విశ్వనాథ్ మంగళవారం రాత్రి బాత్రూంలో కుప్పకూలిపోయాడు. దీంతో అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మంత్రి మరణించారని కర్ణాటక రెవెన్యూశాఖ మంత్రి అశోక చెప్పారు. ఉమేష్ విశ్వనాథ్ ఆకస్మిక మృతి బీజేపీకి తీరని లోటని మంత్రి అశోక వ్యాఖ్యానించారు.ఉమేష్ విశ్వనాథ్ సేవాభావం,సమర్థత, అంకితభావం ఉన్న మంత్రి అని, ఆయన లేని లోటు తీర్చలేనిదని సీఎం బసవరాజ్ బొమ్మై ట్వీట్ చేశారు.( tweeted CM Bommai) అనంతరం మంత్రి భౌతికకాయానికి నివాళులు అర్పించారు.
61 ఏళ్ల ఉమేష్ రెండు కీలక శాఖలకు మంత్రిగా ఉన్నారు. మంత్రి మృతి వార్త తెలిసిన వెంటనే మంత్రులు గోవింద్ కార్జోల్, సుధాకర్, బీజేపీ నేతలు ఆసుపత్రికి వచ్చి తమ సంతాపం తెలిపారు.ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీకి చెందిన సిద్ధరామయ్య కూడా మంత్రి మృతి పట్ల తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఉమేష్ 8 సార్లు బెల్గావి జిల్లా నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. బెల్గావి జిల్లాలో మంత్రి మృతికి సంతాప సూచకంగా బుధవారం స్కూళ్లు, కళాశాలలను మూసివేశారు.