కర్ణాటక వాసి మృతి
ABN , First Publish Date - 2021-11-28T05:53:46+05:30 IST
కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో జరుగుతున్న క్రైస్తవ మహా సభలో పాల్గొనడానికి వెళ్తూ రాయచూరు తాలుకా అల్కూరు గ్రామానికి చెందిన రాకేష్(28) మృత్యువాత పడ్డాడు.
- క్రైస్తవ సభకు వెళ్తూ కానరాని లోకాలకు
ఆదోని రూరల్, నవంబరు 27: కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో జరుగుతున్న క్రైస్తవ మహా సభలో పాల్గొనడానికి వెళ్తూ రాయచూరు తాలుకా అల్కూరు గ్రామానికి చెందిన రాకేష్(28) మృత్యువాత పడ్డాడు. రాకేష్, దేవరాజు ఒక ద్విచక్ర వాహనంలో ప్రవీణ్కుమార్, సాదక్రాజు మరో ద్విచక్ర వాహనంలో బళ్లారిలో జరుగుతున్న క్రైస్తవ మహాసభలకు శనివారం వారి గ్రామం నుంచి బయలుదేరారు. మండలంలోని బల్లేకల్ గ్రామానికి చేరుకునే క్రమంలో ముందు వెళ్తున్న బస్సు వెనుక భాగం రాజశేఖర్, దేవరాజు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని తగిలింది. దీంతో రోడ్డుపై పడ్డ వారిపై ఎదురుగా వస్తున్న లారీ వెళ్లింది. దీంతో తీవ్ర గాయాలైన వారిరువురిని ఆదోని ఏరియా ఆసుపత్రికి వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం రాయచూరుకు తరలించారు. అక్కడ కోలుకోలేక రాకేష్ మృతి చెందగా దేవరాజ్ చికిత్స పొందుతున్నాడు. మృతుడికి ఆరు నెలల క్రితం వివాహమైంది. వీరితోపాటు వెళ్తున్న స్నేహితులు ప్రవీణ్కుమార్, సాదక్రాజు స్నేహితుడి మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దతుంబళం ఎస్ఐ చంద్ర తెలిపారు.