Karnataka: మదీవలేశ్వర్ మఠాధిపతి ఆత్మహత్య.. సూసైట్ నోట్ స్వాధీనం

ABN , First Publish Date - 2022-09-05T22:00:57+05:30 IST

కర్ణాటకలోని బెళగవిలో లింగాయత్ మఠాధిపతి బసవ సిద్ధలింగ స్వామి సోమవారం ఉదయం..

Karnataka: మదీవలేశ్వర్ మఠాధిపతి ఆత్మహత్య.. సూసైట్ నోట్ స్వాధీనం

బెళగవి: కర్ణాటకలోని బెళగవి (Belagavi)లో లింగాయత్ మఠాధిపతి (Lingayat seer) బసవ సిద్ధలింగ స్వామి (Basava Siddaling Swami) సోమవారం ఉదయం ఆత్మహత్య (Suicide) చేసుకున్నారు. మఠంలోనే ఆయన ఆత్మహత్య చేసుకోవడం సంచలనమైంది. శ్రీ గురు మదీవలేశ్వర్ మఠాధిపతి (Sri Guru Madiwaleshwar)గా సిద్ధలింగ స్వా్మి ఉన్నారు. ఉదయమే స్వామి స్వామి శిష్యులు, సహాయకులు ఆయన ఉంటున్న క్వార్టర్స్‌లో చనిపోయి ఉండటాన్ని గమినించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలిలో సూసైట్ నోట్ (Suicide note)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ నోట్‌లో ఏముంది? ఆయన ఆత్మహత్యకు దారితీసిన కారణాలు ఏమిటనేవి వెంటనే తెలియలేదు.


కర్ణాటకలోని కొన్ని మఠాల్లో లైంగిక దాడుల ఆరోపణల కేసులపై ఇద్దరు మహిళలకు మాట్లాడుతున్న ఓ వీడియో చూసి ఆయన మనస్తాపం చెందినట్టు కొందరు చెబుతున్నారు. ఆ వీడియోలో ఆయన పేరును కూడా ఆ మహిళలు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. కాగా, ఈ మధ్యనే ఇద్దరు బాలికలపై లైంగిక దాడులకు పాల్పడిన ఆరోపణలపై మురుఘ మఠాధిపతి శివమూర్తి శరనరును పోలీసులు అరెస్టు చేశారు. ఏళ్ల తరబడి స్వామి తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆ బాలికలు ఆరోపించారు. దీనిపై కర్ణాటకలోని చిత్రదుర్గ, మైసూరు జిల్లాలకు చెందన వివిధ సంస్థల నుంచి నిరసనలు వ్యక్తం కావడంతో శివమూర్తిని అరెస్టు చేశారు.

Updated Date - 2022-09-05T22:00:57+05:30 IST