రాష్ట్రంలో భారీగా పెరిగిన Covid కేసులు
ABN , First Publish Date - 2022-06-11T16:33:15+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 525 మందికి పాజిటివ్నిర్ధారణ అయిం ది.
బెంగళూరు, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 525 మందికి పాజిటివ్నిర్ధారణ అయిం ది. బెంగళూరులోనే 494 కేసులు ఉండడం గమనార్హం. దీంతో రాష్ట్రంలోని యాక్టివ్కేసుల సంఖ్య 3,177 దాటేసిందని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. తాజాగా కరోనా పాజిటివిటీ రేటు 2.31 శాతంగా నమోదయిందని పేర్కొన్నారు. 22 మంది కోలుకున్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్ పరీక్షలను మరింత పెంచాలని నిర్ణయించారు. మరోవైపు కేంద్రం జారీ చేసిన కొవిడ్ కొత్త మార్గదర్శకాలను రాష్ట్రంలోనూ కట్టుదిట్టంగా అమలు చేస్తామని ఆ రోగ్యశాఖ మంత్రి సుధాకర్ ప్రకటించారు. థియేటర్స్, మాల్స్, హోటళ్లు, విద్యాసంస్థలు ఇతర అన్ని బహిరంగ ప్రదేశాలలో మాస్క్ను తప్పనిసరి చేస్తూ కేంద్రం తాజా మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు.