530 మందికి Covid పాజిటివ్
ABN , First Publish Date - 2022-06-21T17:36:36+05:30 IST
రాష్ట్రంలో 500కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైద్యఆరోగ్యశాఖ సోమవారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. 530 మందికి
బెంగళూరు, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 500కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైద్యఆరోగ్యశాఖ సోమవారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. 530 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా బెంగళూరులో 494 మందికి సోకింది. మైసూరులో 6, దక్షిణకన్నడ, కలబురగిలో 5 చొప్పున, బళ్లారి, బెళగావి, రామనగర, ఉత్తరకన్నడలో 3 చొప్పున, ఉడుపిలో 2, బాగల్కోటె, ధారవాడ, గదగ్, శివమొగ్గ, తుమకూరు, విజయపురలో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. 637 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటలలో ఎవరూ మృతి చెందలేదు. 4928 యాక్టివ్కేసులు ఉండగా బెంగళూరులో 4723 మం ది చికిత్స పొందుతున్నారు.