ఇక నిరంతరంగా రాష్ట్రానికి Modi, Amith sha
ABN , First Publish Date - 2022-05-03T17:16:49+05:30 IST
రాష్ట్రానికి ఇకపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా నిరంతరంగా వస్తుంటారని మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప తెలిపారు. శివమొగ్గ జిల్లా
- నాయకత్వ మార్పు ఉండదు
- మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప
బెంగళూరు: రాష్ట్రానికి ఇకపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా నిరంతరంగా వస్తుంటారని మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప తెలిపారు. శివమొగ్గ జిల్లా శికారిపురలో సోమవారం యడియూరప్ప మీడియాతో మాట్లాడుతూ అమిత్షాతో తాను ప్రత్యేకంగా మాట్లాడతానన్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితి తెలుసుకునేందుకే అమిత్షా వస్తున్నారని వివరించారు. ఇకపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా తరచూ రాష్ట్రానికి వస్తారన్నారు. ఇద్దరు అగ్రనేతలు రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారిస్తారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 150 సీట్లు గెలిచే లక్ష్యంతో సిద్దమవుతున్నామన్నారు. తన ఉద్దేశ్యం ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం నాయకత్వ మార్పు ఉండదన్నారు. కాగా మైసూరులో పార్టీ జాతీయనేత బీఎల్ సంతోష్ వ్యాఖ్యలపై దాటవేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడం కేంద్రంలోని పెద్దలు తీసుకునే నిర్ణయమన్నారు. పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర పర్యటనకు సిద్దమైనట్లు తెలిపారు. బూత్ స్థాయి నుంచి పార్టీని ప్రగతి పథంలో తీసుకెళ్లేందుకు కార్యకర్తలను కలిసి చైతన్యం కల్పిస్తామన్నారు.