వైభవంగా కార్తీక దీపోత్సవం
ABN , First Publish Date - 2020-11-30T03:51:02+05:30 IST
కార్తీక పౌర్ణమి సందర్భంగా జిల్లావ్యాప్తంగా ఆదివారం రాత్రి దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
ఒంగోలు , నవంబర్ 29 : కార్తీక పౌర్ణమి సందర్భంగా జిల్లావ్యాప్తంగా ఆదివారం రాత్రి దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో దేవాలయాలకు వచ్చి 365 వత్తులతో దీపాలను వెలిగించారు. సుఖసంతోషాలతో ఉండేలా దీవించాలని సర్వేశరుడిని ప్రార్థించారు. ఇదిలా ఉండగా కరోనా నేపథ్యంలో సోమవారం సముద్ర స్నానాలను నిషేధించారు. తీరప్రాంతానికి ఎవ్వరూ రావద్దని పోలీసు అధికారులు విజ్ఞప్తి చేశారు.