వేడుకగా కార్తీక దీపోత్సవం

ABN , First Publish Date - 2021-12-03T06:00:36+05:30 IST

మండలంలోని ఆర్‌ మరువపల్లి గ్రామంలో వెలసిన సాయిబాబా దేవాలయంలో కార్తీక దీపోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు.

వేడుకగా కార్తీక దీపోత్సవం
ఆలయంలో దీపాలు వెలిగిస్తున్న మహిళలు


రొద్దం, డిసెంబరు 2: మండలంలోని ఆర్‌ మరువపల్లి గ్రామంలో వెలసిన సాయిబాబా దేవాలయంలో కార్తీక దీపోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. మహిళలు పెద్దసంఖ్యలో ఆలయానికి చేరుకుని దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. 


అమరాపురం: మండల కేంద్రంలోని షిరిడీ సాయిబాబా ఆలయంలో గురువారం లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం 8 గంటలకు స్వామివారికి అభిషేకం, పంచామృతాభిషేకం అనంతరం ప్రత్యేక పూజలను అర్చకులు నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు హోమం, సాయిఅర్చన, భజన, సంకీర్తన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. 


Updated Date - 2021-12-03T06:00:36+05:30 IST