కార్తీక మాసం తొలిరోజు...శైవక్షేత్రాల్లో భక్తుల సందడి

ABN , First Publish Date - 2021-11-05T13:04:14+05:30 IST

కార్తిక మాసం తొలిరోజు కావడంతో జిల్లా వ్యాప్తంగా శైవక్షేత్రాల్లో భక్తుల సందడి నెలకొంది.

కార్తీక మాసం తొలిరోజు...శైవక్షేత్రాల్లో భక్తుల సందడి

ప్రకాశం: కార్తిక మాసం తొలిరోజు కావడంతో జిల్లా వ్యాప్తంగా శైవక్షేత్రాల్లో భక్తుల సందడి నెలకొంది. శివాలయాలు శివనామస్మరణలతో మారుమ్రోగుతున్నాయి. ఒంగోలు, చీరాలలో ఉదయం నుండే శైవ క్షేత్రాలకు భక్తులు బారులు తీరారు. పంచామృతాలతో స్వామిని అభిషేకించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు దేవాలయ ప్రాంగణంలో కార్తిక దీపాలను వెలిగించారు. దేవస్దాన కమిటి సభ్యులు శివాలయాలను విద్యుత్ దీపాలంకరణలతో శోభయామానంగా తీర్చిదిద్దారు. 

Updated Date - 2021-11-05T13:04:14+05:30 IST