శంభో శంకర..
ABN , First Publish Date - 2021-11-28T05:25:35+05:30 IST
మండలంలోని శివాలయాల వద్ద భక్తులు కార్తీక మాసం పురస్కరించుకుని శనివారం కార్తీక దీపారాదనలు చేశారు.
శివాలయాల్లో కార్తీక పూజలు
మార్మోగిన శివనామ స్మరణ
కామవరపుకోట, నవంబరు 27 : మండలంలోని శివాలయాల వద్ద భక్తులు కార్తీక మాసం పురస్కరించుకుని శనివారం కార్తీక దీపారాదనలు చేశారు. జ్యోతిర్లింగార్చన, ఓంకారం, శివుని అలంకారంలో దీపాలను అలంకరించి ఆరాధించారు. కామవరపుకోట భద్రకాళీ సహిత వీరభద్రస్వామి ఆలయం, ఆడమిల్లి కంచి కామాక్షి సమేత ఏకాంబరేశ్వరస్వామి, తడికలపూడి గంగా పార్వతీ సమేత గాంగేశ్వరస్వామి ఆలయాల వద్ద భక్తులు పూజలు చేశారు. శంభో శంకర అంటూ ఆలయాల్లో శివనామ స్మరణ మార్మోగింది. ఆడమిల్లి మందా సమేత శనీశ్వరస్వామి ఆలయంలో తైలాభిషేకాలు నిర్వహించి దోషనివారణ పూజలు జరిపారు.