హరోం హర!

ABN , First Publish Date - 2021-11-30T05:02:12+05:30 IST

జిల్లాలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. శివ నామస్మరణ మార్మోగింది.

హరోం హర!
విజయనగరం పశుపతినాథేశ్వర ఆలయ ప్రాంగణంలో భక్తులు ఇలా..

   శివాలయాల్లో కార్తీక పూజలు   

 వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ  

(ఆంధ్రజ్యోతి బృందం)

జిల్లాలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. శివ నామస్మరణ మార్మోగింది. కార్తీక నాలుగో సోమవారం సందర్భంగా శైవక్షేత్రాలు, ప్రముఖ ఆలయాలు కిటకిట లాడాయి.  వేకువజాము నుంచే క్యూలైన్‌లో నిరీక్షించిన భక్తులు ప్రత్యేక అలంకరణలో ఉన్న శివయ్యను దర్శించి పులకించి పోయారు. ఈ సందర్భంగా క్షీరాభిషేకాలు, రుద్రాభి షేకం, అర్చనలు, కుంకుమ పూజలు చేశారు. కొన్ని చోట్ల అన్నదాన కార్య క్రమాలు నిర్వహించారు. సాయంత్రం మహిళలు దీపారాధన చేసి తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. మొత్తంగా అంతటా సందడి వాతావరణం నెలకొంది. 

 

Updated Date - 2021-11-30T05:02:12+05:30 IST