భక్తిశ్రద్ధలతో కార్తిక పౌర్ణమి

ABN , First Publish Date - 2020-11-30T04:48:55+05:30 IST

పట్టణ, మండలంలోని శివాలయాలలలో ఆదివారం కార్తిక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో కార్తిక పౌర్ణమి

గూడూరు, నవంబరు 29: పట్టణ, మండలంలోని శివాలయాలలలో ఆదివారం కార్తిక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మహిళలు ఆలయాల్లో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. స్థానిక శివాలయంలో శివపార్వతులను ప్రత్యేకంగా అలంకరించి పల్లకీ సేవ నిర్వహించారు. శివాలయాలను విద్యుత్‌ దీపాలతో ముస్తాబు చేశారు. 

కోట :  కోట లింగాల స్వామి దేవాలయంలోని బాలసుబ్రహ్మణ్యం స్వామి ఆలయంలో దీపాలు వెలిగించారు.  సోమేశ్వరాలయంలో మాజీ ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్‌రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో శిఖర దీపాన్ని,  ఆలయ ప్రాంగణంలో మహిళలు దీపాలను వెలిగించారు. గూడలి సంగమేశ్వరాలయంలో కోట, వాకాడు, చిట్టమూరు మండలాలకు చెందిన మహిళలు దీపాలు వెలిగించారు. 

Updated Date - 2020-11-30T04:48:55+05:30 IST