రేపు ఓటీటీలో ‘చావు కబురు చల్లగా’
ABN , First Publish Date - 2021-04-22T05:38:05+05:30 IST
కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా రూపొందించిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. జిఏ2 పిక్చర్స్ బ్యానర్పై బన్నీవాస్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 23న ఈ సినిమా ఓటీటీ ఆహాలో విడుదలవుతుంది.
విజయవాడ కల్చరల్, ఏప్రిల్ 21 : కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా రూపొందించిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. జిఏ2 పిక్చర్స్ బ్యానర్పై బన్నీవాస్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 23న ఈ సినిమా ఓటీటీ ఆహాలో విడుదలవుతుంది. చిత్రాన్ని పెగళ్లపాటి కౌళిక్ తెరకెక్కించారు. బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో లావణ్య త్రిపాఠి జూమ్కాల్లో మాట్లాడుతూ ‘డిఫరెంట్ కాన్సెప్ట్తో రూపొందించిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. విలక్షణమైన పాత్ర చేశాను. ఈ సినిమా ఆహాలో విడుదలవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది’ అని ఆమె అన్నారు. దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి మాట్లాడుతూ చావు కబురు చల్లగా స్టార్ట్ చేసిన సమయంలో ఇదొక రియలిస్టిక్ పాయింట్ అనే స్టార్ట్ చేశామనీ, రిలీజ్ తరువాత ఆ పాయింట్ అనుకున్నంతగా రీచ్ కాలేదనీ, కొత్త పాయింట్ అనుకుని స్టార్ట్ చేసిన ఈ సినిమాను ఇంకా బెటల్గా ఆహాలో విడుదల చేస్తున్నామని చెప్పారు. రీ ఎడిట్ చేస్తానని అనగానే బన్నీవాస్, అల్లు అరవింద్ చాలా సపోర్ట్ చేశారన్నారు. హీరో కార్తికేయ కూడా డబ్బింగ్ చెప్పడానికి ముందుకొచ్చారన్నారు. హీరో కార్తికేయ మాట్లాడుతూ చావుకబురు చల్లగా చిత్రంలో హీరోగా అవకాశం ఇచ్చిన అల్లు అరవింద్, బన్నీ వాస్లకు థ్యాంక్స్ ధన్యవాదలన్నారు. సినిమా విషయానికి వస్తే తన మనసుకు దగ్గరైన సినిమా అని, ఈ సినిమా చూసిన వారు తన కెరీర్ బెస్ట్ ఫర్ఫామెన్స్ అని కితాబిచ్చారని చెప్పారు.