హైకోర్టును ఆశ్రయించిన కార్వి ఎండీ

ABN , First Publish Date - 2021-08-23T20:33:44+05:30 IST

కార్వి ఎండీ పార్థసారథి హైకోర్టును ఆశ్రయించారు. సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని

హైకోర్టును ఆశ్రయించిన కార్వి ఎండీ

హైదరాబాద్‌: కార్వి ఎండీ పార్థసారథి హైకోర్టును ఆశ్రయించారు. సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. పార్థసారథి బెయిల్ పిటిషన్‌పై సీసీఎస్ పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. కార్వీ ఎండీ పార్థసారథిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. రూ. 780 కోట్ల ఎగవేతల కేసులో ఆయనను అరెస్టు చేశారు. అంతేకాదు రూ. 720 కోట్ల నిధులు దుర్వినియోగం చేశారనే అభియోగాలున్నాయి. ప్రస్తుతం పార్థసారధిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. తిరిగి సొమ్ములు కట్టకుండా ఎగవేగవేయడంపై ఆయా బ్యాంకుల ఫిర్యాదు మేరకు పోలీసులు పార్థసారధిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.  


Updated Date - 2021-08-23T20:33:44+05:30 IST