KBC Show: కేబీసీ షోలో కోటి రూపాయలు గెలుచుకున్న మరో కంటెస్టెంట్.. అదే జరిగితే రూ.7.50 కోట్లు ఇతడివే..!

ABN , First Publish Date - 2022-10-07T00:39:00+05:30 IST

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమం ఎన్నో ఏళ్లుగా ప్రజలకు వినోదాన్ని అందించడమే కాదు.

KBC Show: కేబీసీ షోలో కోటి రూపాయలు గెలుచుకున్న మరో కంటెస్టెంట్.. అదే జరిగితే రూ.7.50 కోట్లు ఇతడివే..!

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమం ఎన్నో ఏళ్లుగా ప్రజలకు వినోదాన్ని అందించడమే కాదు.. జ్ఞానాన్ని కూడా పంచుతోంది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న కొందరిని కోటీశ్వరులను చేసింది. ప్రస్తుతం ఆ కార్యక్రమం 14వ సీజన్ టీవీలో ప్రసారమవుతోంది. ఇటీవల మహారాష్ట్రకు చెందిన కవిత అనే మహిళ కోటి రూపాయలు గెలుచుకుని వార్తల్లో నిలిచింది. త్వరలో ఆ అవకాశం ఢిల్లీకి చెందిన శశ్వత్ గోయల్‌కు రాబోతున్నట్టు తెలుస్తోంది. 


ఆ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను సోనీ టీవీ సోషల్ మీడియాలో విడుదల చేసింది. హాట్ సీట్‌లో కూర్చున్న శశ్వత్‌ను అమితాబ్ 7.5 కోట్ల రూపాయల ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నకు జవాబిచ్చేందుకు శశ్వత్ ఆలోచిస్తున్నాడు. ఆ ప్రశ్నకు కనుక శశ్వత్ జవాబు చెబితే ఏకంగా రూ.7.5 కోట్ల రూపాయలు గెలుచుకుంటాడు. అదే కనుక జరిగితే ఈ సీజన్‌లో రూ.7.5 కోట్లు గెలుచుకున్న తొలి కంటెస్టెంట్‌గా శశ్వత్ రికార్డు సృష్టిస్తాడు. ఒకవేళ చెప్పలేకపోతే రూ.75 లక్షలు మాత్రమే దక్కించుకుంటాడు. మరి, శశ్వత్ సరైన సమాధానం ఇచ్చాడో లేదో తెలియాలంటే ఈ నెల 10వ తేదీన ఆ ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఆగాల్సిందే. 

Updated Date - 2022-10-07T00:39:00+05:30 IST