ఓటును సద్వినియోగం చేసుకోండి : ఆర్డీవో

ABN , First Publish Date - 2022-01-26T03:41:07+05:30 IST

మంచి పరిపాలనాదక్షత ఉన్న విలువలు కలిగిన సమర్థవంతమైన ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు ఎన్నికల కమిషన్‌ కల్పించిన ఓటు సద్వినియోగం చేసుకోవాలని కావలి ఆర్డీవో శీనానాయక్‌ పేర్కొన్నారు.

ఓటును సద్వినియోగం చేసుకోండి : ఆర్డీవో
ప్రతిజ్ఞ చేయిస్తున్న ఆర్డీవో శీనానాయక్‌

కావలి, జనవరి 25: మంచి పరిపాలనాదక్షత ఉన్న విలువలు కలిగిన సమర్థవంతమైన ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు ఎన్నికల కమిషన్‌ కల్పించిన ఓటు సద్వినియోగం చేసుకోవాలని కావలి ఆర్డీవో శీనానాయక్‌ పేర్కొన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆర్డీవో కార్యాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఆర్డీవో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఓటును మద్యం, నగదుకు అమ్ముకుని దేశ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టవద్దని చెప్పారు. కొత్తగా ఓటు పొందిన వారికి ఓటు విలువపై అవగాహన కల్పించారు. సమర్థవంతమైన నేతలను ఎన్నుకునేందుకు ఓటును సద్వినియోగం చేసుకుంటామంటూ ప్రతిజ్ఞ చేయించారు. ఇప్పటి వరకు అన్ని ఎన్నికల్లో ఓటు వేసిన వృద్ధ ఓటర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కావలి తహసీల్దార్‌ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-26T03:41:07+05:30 IST