మూడేళ్లలో ఎంపీ అరవింద్ ఏం చేశారో ప్రజలకు చెప్పాలి: MLC Kavita
ABN , First Publish Date - 2022-05-04T20:25:46+05:30 IST
బీజేపీ ఎంపీ అరవింద్పై టీఆర్ఎస్ ఎంఎల్సీ కవిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
నిజామాబాద్: బీజేపీ ఎంపీ అరవింద్పై టీఆర్ఎస్ ఎంఎల్సీ కవిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ నిజామాబాద్ ప్రజలకు ఎంపీ అర్వింద్ చేసింది ఏమీ లేదన్నారు. పసుపు బోర్డు కోసం 2016లో పార్లమెంట్లో ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశామన్నారు. రాందేవ్ బాబాను తీసుకొచ్చి ప్లాంట్ పెట్టాలని కోరామని చెప్పారు. అరవింద్ తప్పుడు ప్రచారాలు చేసి ఎంపీ సీటు గెలిచారని కవిత ఆరోపించారు. మూడేళ్లలో అరవింద్ ఏం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. ఉచిత మాటలతో అరవింద్ టైమ్పాస్ చేస్తున్నారని, మూడేళ్లలో ఆయన నియోజకవర్గానికి రెండు కోట్ల రూపాయలు కూడా తీసుకురాలేదని విమర్శించారు. ఒక్కో పసుపు రైతుకు రూ. 200 కూడా రావని కవిత వ్యాఖ్యానించారు.