జాతీయ టీటీ పోటీల్లో కేబీఎన్ విద్యార్థిని ప్రతిభ
ABN , First Publish Date - 2021-03-03T06:28:51+05:30 IST
32వ జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ పోటీలలో కేబిఎన్ కళాశాల విద్యార్థిని ఆర్.కాజోల్ సునార్ అత్యుత్తమ ప్రతిభను కనబరిచి క్వాలిఫై రౌండుకు చేరుకుందని కళాశాల ప్రిన్సిపాల్ ఈ.వరప్రసాద్ తెలిపారు.
వన్టౌన్, మార్చి 2 : 32వ జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ పోటీలలో కేబిఎన్ కళాశాల విద్యార్థిని ఆర్.కాజోల్ సునార్ అత్యుత్తమ ప్రతిభను కనబరిచి క్వాలిఫై రౌండుకు చేరుకుందని కళాశాల ప్రిన్సిపాల్ ఈ.వరప్రసాద్ తెలిపారు. గత వారంలో హరియానాలో 32వ జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ పోటీలు జరిగినట్లు పేర్కొన్నారు. ఆ పోటీల్లో వరుసగా మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలపై అద్భుతమైన ప్రతిభ కనబరిచినట్లు పేర్కొన్నారు. క్వాలిఫై రౌండ్కి చేరుకుందని తెలిపారు. ఇండియా నెంబర్ వన్ ర్యాంకర్ ఢిల్లీకి చెందిన మల్లికాతాత్రాపై పోరాడి ఓడినదని పేర్కొన్నారు. కాజోల్ తన ప్రతిభతో రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా కాజోల్ సునార్ను, ఆమెను తీర్చిదిద్దిన ఫిజికల్ డైరెక్టర్ హేమచంద్రరావును కళాశాల కార్యదర్శి తూనుకుంట్ల శ్రీనివాసు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.నవీన్ కుమార్లు అభినందించినట్లు వివరించారు.