మరో మోసానికి కేసీఆర్‌ యత్నం: బీజేపీ

ABN , First Publish Date - 2021-03-07T04:42:04+05:30 IST

ఉద్యోగ, ఉపాధి హామీలు నెరవేర్చకుండానే సీఎం కేసీఆర్‌ మరోమారు నిరుద్యోగ భృతి అంటూ నిరుద్యోగులను మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు.

మరో మోసానికి కేసీఆర్‌ యత్నం: బీజేపీ
కలెక్టర్‌ కార్యాలయ ఏవోకు వినతి పత్రం ఇస్తున్న నాయకులు

గద్వాల, మార్చి 6: ఉద్యోగ, ఉపాధి హామీలు నెరవేర్చకుండానే సీఎం కేసీఆర్‌ మరోమారు నిరుద్యోగ భృతి అంటూ నిరుద్యోగులను మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ వద్ద బీజేపీ, బీజేవైఎం నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ అంశం తిరిగి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి రూ.3016తో పాటు రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కలెక్టరేట్‌ ఏవోకు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళ మోర్చా ఉపాధ్యక్షురాలు బండల పద్మావతి, జిల్లా అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి, మహిళ మోర్చా అధ్యక్షురాలు కృష్ణవేణి, భారతి, సమంత, రామాంజనేయులు, జిఎల్‌ చందు, రవిఏక్బోటే, బీజేవైఎం నాయకులు గోసాయి హరి, తరుణ్‌, దిల్లివాల కృష్ణ, రాజశేఖర్‌, ఎంకే ప్రవీణ్‌, అనిల్‌, మోహన్‌రెడ్డి,, పరశురాం పాల్గొన్నారు.

Updated Date - 2021-03-07T04:42:04+05:30 IST