TS News: నయా నిజాం కేసీఆర్: బండి సంజయ్
ABN , First Publish Date - 2022-08-27T03:09:42+05:30 IST
ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగించవచ్చంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు సీఎం కేసీఆర్ (KCR)కు చెంపపెట్టు లాంటిదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి
స్టేషన్ఘన్పూర్: ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగించవచ్చంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు సీఎం కేసీఆర్ (KCR)కు చెంపపెట్టు లాంటిదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం పాంనూర్ గ్రామ పరిధిలో ఈ నెల 23న సంజయ్ని అరెస్టు చేయడంతో ప్రజా సంగ్రామ యాత్ర నిలిచిపోయిన విషయం తెలిసిందే. కాగా, శుక్రవారం అదే చోటు నుంచి సంజయ్ యాత్రను మళ్లీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులపై వస్తున్న లిక్కర్ స్కామ్ (Liquor scam) ఆరోపణల విషయంలో ప్రజల దృష్టిని మళ్లించడానికే ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 21 రోజుల పాటు యాత్ర కొనసాగిన తర్వాత సీఎం కేసీఆర్కు అనుమతులు గుర్తుకువచ్చాయా? అని ప్రశ్నించారు. అనుమతి ఇచ్చిన ప్రభుత్వమే మాట మార్చి అనుమతులు లేవని మాట్లాడడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా, కేసులు పెట్టినా, లాఠీలతో కొట్టినా, పీడీయాక్టు కేసు నమోదు చేసినా భయపడనని బండి సంజయ్ స్పష్టం చేశారు.