ఏపీలో కేసీఆర్ పుట్టిన రోజు
ABN , First Publish Date - 2022-02-18T01:04:36+05:30 IST
తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక తిరుమలశెట్టి వాసుకు చెందిన గ్రీన్ లైఫ్ నర్సరీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా
కడియం: తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక తిరుమలశెట్టి వాసుకు చెందిన గ్రీన్ లైఫ్ నర్సరీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన చిత్రాన్ని తీర్చిదిద్ది కేసీఆర్ పుట్టినరోజు వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ కరోనా సమయంలో మొక్కల ఎగుమతులు నిలిచిపోయి నర్సరీ రైతులు ఇబ్బందులు పడుతున్న వేళ సీఎం కేసీఆర్ కోటి మొక్కల మహాయజ్ఞం పేరుతో నర్సరీ రైతులను ఆదుకున్నందుకు కృతజ్ఞతతో ఆయన చిత్రాన్ని ఈ విధంగా తీర్చిదిద్దామన్నారు. పూలు, కూరగాయలు, నవధాన్యాలు, వివిధ రకాల మొక్కలతో కేసీఆర్ చిత్రం కూర్పును తీర్చిదిద్దినట్టు వాసు, స్థానిక సొసైటీ త్రిసభ్య కమిటీ చైర్మన్ తిరుమలశెట్టి శ్రీను తెలిపారు.