కేంద్రంపై అసహనం వ్యక్తం చేసిన కేసీఆర్
ABN , First Publish Date - 2022-01-10T00:03:51+05:30 IST
పలు ప్రాజెక్ట్లకు కేంద్రం అనుమతులు రాకపోవడంపై సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. కేంద్రానికి అన్ని వివరాలు
హైదరాబాద్: పలు ప్రాజెక్ట్లకు కేంద్రం అనుమతులు రాకపోవడంపై సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. కేంద్రానికి అన్ని వివరాలు, అదనపు సమాచారం అందించి.. త్వరితగతిన అనుమతులు పొందాలని అధికారులకు కేసీఆర్ ఆదేశించారు. కరోనా పట్ల ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. కరోనాపై ప్రజలు భయాందోళన చెందొద్దని చెప్పారు. ఆరోగ్య, ఇరిగేషన్, రోడ్ల భవనాల శాఖ అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 15 ఏళ్లు పైబడిన ప్రతిఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. కరోనా లక్షణాలుంటే వెంటనే టెస్టులు చేయించుకోవాలన్నారు. రేపు వృద్ధులు, ఫ్రెంట్లైన్ వర్కర్లకు బూస్టర్ డోస్ వేయించుకోవాలని కేసీఆర్ సూచించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలని చెప్పారు. సచివాలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ భవనాల.. నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలని కేసీఆర్ ఆదేశించారు.