ఢిల్లీకి బయల్దేరిన కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-04-03T22:57:35+05:30 IST

కుటుంబ సభ్యులతో కలిసి సీఎం కేసీఆర్‌ ఢిల్లీ బయల్దేరారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లారు.

ఢిల్లీకి బయల్దేరిన కేసీఆర్‌

హైదరాబాద్: కుటుంబ సభ్యులతో కలిసి సీఎం కేసీఆర్‌ ఢిల్లీ బయల్దేరారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లారు. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, కుమార్తె కవిత ఉన్నారు. ఢిల్లీ కేంద్రంగా ఎంపీలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 11న ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధుల నిరసన చేపట్టనున్నారు. రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కు  టీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. ఇప్పటికే ప్రధాని అపాయింట్‌మెంట్‌ సీఎంవో వర్గాలు కోరాయి. ధాన్యం అంశంలో బీజేపీ వ్యతిరేక శక్తులను కేసీఆర్ కూడగట్టనున్నారు. ఎంపీ సంతోష్‌కుమార్ జైపూర్ టూర్‌లో ఉన్నారు. జైపూర్ నుంచి ఆయన నేరుగా డిల్లీకి వెళ్తారు. 

Updated Date - 2022-04-03T22:57:35+05:30 IST