కరోనాపై తప్పుడు ప్రచారం చేసింది కేసీఆరే

ABN , First Publish Date - 2020-07-07T07:36:47+05:30 IST

కరోనాపై తప్పుడు ప్రచారం చేసింది కేసీఆరే

కరోనాపై తప్పుడు ప్రచారం చేసింది కేసీఆరే

హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): కరోనాపై తప్పుడు ప్రచారం చేసింది సీఎం కేసీఆరేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో  విమర్శించారు. అసత్య ప్రచారం చేసిన సీఎంపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. పారాసిటమాల్‌ ట్యాబ్లెట్‌ వేసుకుంటే కరోనా రాదని, ఉష్ణోగ్రత 22 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటే వైరస్‌ తట్టుకోదని అంటూ యావత్‌ తెలంగాణ ప్రజలను కేసీఆర్‌ తప్పుదోవ పట్టించారన్నారు. కాగా, ఉద్యోగులకు పీఆర్‌సీ అమలుచేసి బకాయిలకు బాండ్లు ఇవ్వాలని బీజేపీ రిటైర్డు టీచర్స్‌, ఎంప్లాయీస్‌ సెల్‌ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, నేతలు ప్రభాకర్‌, వెంకటరెడ్డి, సరోత్తంరెడ్డి డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-07-07T07:36:47+05:30 IST