కేసీఆర్‌ గుండె కరగడం లేదు: షర్మిల

ABN , First Publish Date - 2021-11-23T00:24:20+05:30 IST

ధాన్యం కొనుగోళ్లపై డ్రామాలు ఢిల్లీకి చేరాయని వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల అన్నారు. కానీ కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు నడిచేది లేదని

కేసీఆర్‌ గుండె కరగడం లేదు: షర్మిల

హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లపై డ్రామాలు ఢిల్లీకి చేరాయని వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల అన్నారు. కానీ కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు నడిచేది లేదని, కొనేది లేదన్నారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ అకాల వర్షాలతో ధాన్యం తడిసి మొలకలొస్తున్నాయని తెలిపారు. కష్టపడి పండించిన పంట కళ్ల ముందే కొట్టుకుపోతుందన్నారు. కొంటారో కొనరో తెలియక ధాన్యం కుప్పలపైనే.. రైతుల గుండెలు ఆగిపోతున్నా.. సీఎం కేసీఆర్‌ గుండె కరగడం లేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాదిలో చనిపోయిన రైతులకు లక్షల సాయం చేస్తున్న మీకు.. తెలంగాణ రైతుల కష్టాలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నామని షర్మిల ప్రకటించారు.


Updated Date - 2021-11-23T00:24:20+05:30 IST