బీజేపీ విజయంతో కేసీఆర్‌ గుండె ఆగింది: మురళీధర్‌రావు

ABN , First Publish Date - 2022-03-12T23:52:41+05:30 IST

దేశంలో ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ గుండె ఆగిపోయిందని బీజేపీ

బీజేపీ విజయంతో కేసీఆర్‌ గుండె ఆగింది: మురళీధర్‌రావు

హైదరాబాద్: దేశంలో ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ గుండె ఆగిపోయిందని బీజేపీ నేత మురళీధర్‌రావు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే రోజుల్లో కేసీఆర్‌ శాశ్వతంగా ఆసుపత్రిలోనే గడుపవలసిన పరిస్థితులు దగ్గర పడుతున్నాయన్నారు. హిందూ ధర్మ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుంకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వేలాది ఎకరాల భూములను టీఆర్‌ఎస్‌ నాయకులు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ రాజ్యాంగం మార్చాలని పిచ్చి కూతలు కూస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలకు చరమగీతం పాడవలసిన తరుణం దగ్గరలో ఉందని చెప్పారు. నిర్మల్‌, భైంసా, ఆదిలాబాద్‌లలో మత కల్లోలాలు పెరిగిపోయాయని, పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం సరికాదని మురళీధర్‌రావు తప్పుబట్టారు. 

Updated Date - 2022-03-12T23:52:41+05:30 IST