కేసీఆర్ నాకు సన్నిహితుడు: కేంద్ర మంత్రి అథావలే

ABN , First Publish Date - 2022-05-01T00:15:54+05:30 IST

సీఎం కేసీఆర్ తనకు అత్యంత సన్నిహితుడని కేంద్ర

కేసీఆర్ నాకు సన్నిహితుడు: కేంద్ర మంత్రి అథావలే

హైదరాబాద్: సీఎం కేసీఆర్ తనకు అత్యంత సన్నిహితుడని కేంద్ర మంత్రి అథావలే అన్నారు. నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలో రిపబ్లికన్‌ పార్టీని విస్తరిస్తామన్నారు.  తెలంగాణలో దళితులకు 5 ఎకరాల పట్టా భూములు, సొంత ఇల్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మోదీకి వ్యతిరేకంగా ఎవరూ నిలబడలేరన్నారు. కేసీఆర్ కూడా మోదీతో కలిసి రావాలని ఆయన కోరారు. కూటములు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ అందరికీ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఏ ఫ్రంట్‌కు మోదీని ఓడించే సత్తా లేదని కేంద్ర మంత్రి  అన్నారు. 

Updated Date - 2022-05-01T00:15:54+05:30 IST