KCRకు MODI చురకలు
ABN , First Publish Date - 2022-05-26T19:19:30+05:30 IST
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెటైర్లు వేశారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా బేగంపేట విమానాశ్రయం
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెటైర్లు వేశారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా బేగంపేట విమానాశ్రయం వద్ద బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తెలంగాణ పాలకులకు అంధవిశ్వాసాలు పెరిగాయంటూ పరోక్షంగా కేసీఆర్ను ఎద్దేవా చేశారు. కొన్ని ప్రాంతాలకు వెళ్తే అరిష్టమని భావించే ధోరణిని ప్రధాని తప్పుబట్టారు. సెక్రటేరియట్తో పాటు కొన్ని చోట్లకు వెళ్లాలంటే మూఢనమ్మకాల కారణంగా భయపడుతున్నారని ప్రధాని పరోక్షంగా కేసీఆర్కు చురకలంటించారు. తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు కూడా కొందరు తనను కొన్ని చోట్లకు వెళ్లొద్దన్నారని, అయినా ఆధునిక విజ్ఞానాన్ని నమ్మి అన్ని చోట్లకూ వెళ్లానని మోదీ గుర్తు చేశారు. కాషాయ వస్త్ర ధారి అయిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా నోయిడా వెళ్లి మూఢ నమ్మకాలకు చెక్ పెట్టడమే కాక తిరిగి ముఖ్యమంత్రిగా గెలిచారంటూ మోదీ హర్షధ్వానాల మధ్య చెప్పారు. 21వ శతాబ్దంలో కూడా అంధవిశ్వాసాలను నమ్మే పాలకుల కారణంగా తెలంగాణ ప్రజలు నష్టపోతారని ప్రధాని చెప్పారు.