Delhiకి కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-05-21T00:13:37+05:30 IST

సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన ఖారారైంది. ఈ సారి ఆయన వారం రోజుల పాటు హస్తినలోనే ఉంటారని ప్రగతిభవన్ వర్గాలు చెబుతున్నాయి.

Delhiకి కేసీఆర్‌

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన ఖారారైంది. ఈ సారి ఆయన వారం రోజుల పాటు హస్తినలోనే ఉంటారని ప్రగతిభవన్ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్‌ (KCR) వెంట సతీమణి శోభ, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవిత, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ వినోద్, పలువురు నేతలు, అధికారులు ఢిల్లీ వెళ్తారు. ఈ పర్యటనలో కేసీఆర్.. రాజకీయ, ఆర్థిక ప్రముఖులతో భేటీకానున్నారు. జాతీయ మీడియా ప్రతినిధులతో సమావేశం కానున్నారు. సాగుచట్టాల రద్దు ఉద్యమంలో చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా రైతు కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని కేసీఆర్ అందించనున్నారు. ఈ తర్వాత ఈ నెల 26న బెంగళూరు (Bengaluru)లో కేసీఆర్ పర్యటిస్తారు. మాజీ ప్రధాని దేవగౌడ, మాజీ సీఎం కుమారస్వామితో కేసీఆర్ భేటీ అవుతారు. ఈ నెల 27న మహారాష్ట్ర (Maharashtra)లో కేసీఆర్ పర్యటిస్తారు. ఈ పర్యటనలో రాలేగావ్‌సిద్ధిలో అన్నాహజారేతో కేసీఆర్ భేటీ అవుతారు. ఈ నెల 29,30 తేదీల్లో బంగాల్‌, బిహార్‌లో కేసీఆర్ పర్యటించనున్నారు. గాల్వాల్‌ లోయలో మరణించిన సైనిక కుటుంబాలకు సీఎం పరామర్శించనున్నారు. మరణించిన సైనిక కుటుంబాలకు కేసీఆర్ ఆర్థిక సాయం అందజేస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2022-05-21T00:13:37+05:30 IST