దేశంలో రాజకీయంగా సంచలనం జరగబోతోంది: KCR
ABN , First Publish Date - 2022-05-22T00:32:42+05:30 IST
దేశంలో రాజకీయంగా సంచలనం జరగబోతోందని సీఎం కేసీఆర్ (KCR) జోస్యం చెప్పారు. దేశంలో కొత్త విద్యావ్యవస్థ తీరుపై కేసీఆర్ విమర్శలు సంధించారు.
ఢిల్లీ: దేశంలో రాజకీయంగా సంచలనం జరగబోతోందని సీఎం కేసీఆర్ (KCR) జోస్యం చెప్పారు. దేశంలో కొత్త విద్యావ్యవస్థ తీరుపై కేసీఆర్ విమర్శలు సంధించారు. ఢిల్లీ (Delhi)లో సర్వోదయ స్కూల్ను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (Kejriwal)తో కలిసి కేసీఆర్ సందర్శించారు. విద్యావిధానంలో ఢిల్లీ సర్కార్ తీసుకొచ్చిన మార్పులు, డిజిటల్ విధానం, నూతన సంస్కరణలను కేసీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఏకపక్షంగా కేంద్రం కొత్త విద్యావిధానం తెచ్చిందని తప్పుబట్టారు. కొత్త విద్యావిధానంపై రాష్ట్రాలతో కేంద్రం సంప్రదించలేదని విమర్శించారు. ఢిల్లీ తరహాలో విద్యావిధానం ఉంటే తామూ ఆమోదిస్తామని, కానీ కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని కేసీఆర్ విమర్శించారు.
ఢిల్లీ పర్యటనలో ఆర్థిక వేత్తలు, రాజకీయ, మీడియా రంగ ప్రముఖులతో భేటీ కానున్న కేసీఆర్.. ప్రత్యామ్నాయ ఎజెండా రూపకల్పనపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన సైనిక కుటుంబాలను కలిసి, ఆర్థిక సాయం అందించనున్నారు. అలాగే, జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన రైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27వ తేదీనే తిరిగి ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. ఆ తర్వాత 29, 30 తేదీల్లో బెంగాల్, బిహార్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.