కమిషన్ రాదని ఆ GOను KCR పక్కన పెట్టారు: బండి సంజయ్

ABN , First Publish Date - 2022-05-06T02:32:08+05:30 IST

కమిషన్ రాదని ఆ GOను KCR పక్కన పెట్టారు: బండి సంజయ్

కమిషన్ రాదని ఆ GOను KCR పక్కన పెట్టారు: బండి సంజయ్

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. పాలమూరు ప్రజలకు కసి ఉందని, వాళ్లు ఎదుర్కొంటున్న కష్టాలకు దిక్కు లేదని బండి సంజయ్ అన్నారు. పాలమూరుపై సీఎం కేసీఆర్ కక్ష కట్టారని, ఆర్డీఎస్ సమస్యను ఆరు నెలల్లో తీరుస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ సహకరించాలని.. లేకుంటే చరిత్ర క్షమించదని బండి సంజయ్ అన్నారు. 69 జీవో ద్వారా నారాయణ పేట.. కొడంగల్ ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయని తెలిపారు. కానీ సీఎం కేసీఆర్‌కు కమిషన్ రాదని దాన్ని పక్కన పెట్టారని సంజయ్ విమర్శించారు.

Read more