గవర్నర్ వ్యవస్థతో పెట్టుకున్న కేసీఆర్ ఖతం అవుతాడు: రాజాసింగ్
ABN , First Publish Date - 2022-04-06T21:51:43+05:30 IST
గవర్నర్ వ్యవస్థతో పెట్టుకున్న సీఎం కేసీఆర్ ఖతం అవుతాడని ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వ తీరుపై ప్రధాని మోదీకి గవర్నర్ ఫిర్యాదు
హైదరాబాద్: గవర్నర్ వ్యవస్థతో పెట్టుకున్న సీఎం కేసీఆర్ ఖతం అవుతాడని ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వ తీరుపై ప్రధాని మోదీకి గవర్నర్ తమిళసై ఫిర్యాదు చేసి ఉండొచ్చని పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గవర్నర్కు ప్రొటోకాల్ కల్పించని సీఎస్ సోమేష్ కుమార్ తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ పెట్టిన ఘనత కేసీఆర్దేనని తప్పుబట్టారు. కేసీఆర్ ప్రభుత్వానికి దమ్ముంటే డ్రగ్స్ విక్రయిస్తున్న వారిని ఎన్కౌంటర్ చేయాలని రాజాసింగ్ సవాల్ విసిరారు. డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న సినీ తారలను మంత్రి కేటీఆర్ కాపాడుతున్నాడని ఆరోపించారు. బార్లు, పబ్లను టీఆర్ఎస్ నేతలే నడుపుతున్నారని మండిపడ్డారు. డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న బీజేపీ నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ని కోరానని రాజాసింగ్ తెలిపారు.