వర్షాలు, వరదల పరిస్థితిపై KCR సమీక్ష

ABN , First Publish Date - 2022-07-11T21:51:38+05:30 IST

తెలంగాణలో వర్షాలు Rains, వరదల పరిస్థితిపై సీఎం కేసీఆర్‌ (CM KCR) సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం నుంచి మంత్రులు

వర్షాలు, వరదల పరిస్థితిపై KCR సమీక్ష

హైదరాబాద్: తెలంగాణలో వర్షాలు Rains, వరదల పరిస్థితిపై సీఎం కేసీఆర్‌ (CM KCR) సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం నుంచి మంత్రులు, ప్రజాప్రతినిధులతో సీఎం ఫోన్‌ (Phone)లో మాట్లాడారు. గోదావరి (Godavari)లో వరద, నదీ ప్రవాహం, ఉపనదుల పరిస్థితిపై ఆయన ఆరా తీశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అవసరమైన చోట తక్షణ చర్యలపై అధికారులకు కేసీఆర్‌ ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో మరో మూడు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని, ప్రయాణాలు తగ్గించుకోవాలని కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. జన సంచారాన్ని తగ్గించే  చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు మూడు రోజులపాటు(సోమ, మంగళ, బుధవారాల్లో) సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పలు శాఖల ఉన్నతాధికారులతో ఆదివారం ప్రగతి భవన్‌లో సీఎం సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-07-11T21:51:38+05:30 IST