అమరుల త్యాగాలతో రాజ్యమేలుతున్న కేసీఆర్
ABN , First Publish Date - 2022-05-20T04:55:56+05:30 IST
అమరుల త్యాగాలతో సాధిం చుకున్న తెలంగాణాలో కేసీఆర్ రాజ్యమేలుతున్నాడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కిని నర్సిం హులు ఆరోపించారు. గురువారం రామకృష్ణాపూర్లో ఏర్పాటు చేసిన మినీ మహానాడులో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముందుగా ఆర్కే-1ఏ గని వద్ద మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వాగతం పలి కారు. అక్కడి నుంచి బైక్ ర్యాలీగా పట్టణ పుర వీధుల గుండా అమరవీరుల స్థూపం వద్దకు చేరుకొని నివాళులర్పించారు.
మందమర్రి, మే 19: అమరుల త్యాగాలతో సాధిం చుకున్న తెలంగాణాలో కేసీఆర్ రాజ్యమేలుతున్నాడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కిని నర్సిం హులు ఆరోపించారు. గురువారం రామకృష్ణాపూర్లో ఏర్పాటు చేసిన మినీ మహానాడులో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముందుగా ఆర్కే-1ఏ గని వద్ద మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వాగతం పలి కారు. అక్కడి నుంచి బైక్ ర్యాలీగా పట్టణ పుర వీధుల గుండా అమరవీరుల స్థూపం వద్దకు చేరుకొని నివాళులర్పించారు. అనంతరం సూపర్బజార్ సెం టర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, ఇటీ వలి కాలంలో మృతి చెందిన తెలుగుదేశం కార్యకర్తల కు సంతాపం తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలు తీర్మానాలను చేశారు. సింగరేణి ప్రైవేటీకరణ, పేదలపై పెనుభారం మోపుతున్న ధరలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మి క వ్యతిరేక విధానాలు, గిట్టుబాటు ధర, రుణమాఫీ వంటి అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో పెద్దప ల్లి పార్లమెంట్ అధ్యక్షుడు సంజయ్, నాయకులు ఐల య్య, గోపాల్ రెడ్డి, జ్యోత్స, రాములు, జక్కుల సమ్మయ్య, ఎండీ శరీఫా, సాగర్, రాజేశ్వర్ మాదవ రావ్ తదితరులు పాల్గొన్నారు.