కేసీఆర్‌ పథకాలు దేశానికే ఆదర్శం : బడుగుల

ABN , First Publish Date - 2022-08-19T06:26:27+05:30 IST

కేసీఆర్‌ రాష్ట్రంలో అ మలుచేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశాని కే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌ అన్నా రు.

కేసీఆర్‌ పథకాలు దేశానికే ఆదర్శం : బడుగుల
ఆసరా పింఛన్లు పంపిణీ చేస్తున్న ఎంపీ లింగయ్యయాదవ్‌

చండూరు, ఆగస్టు 18: కేసీఆర్‌ రాష్ట్రంలో అ మలుచేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశాని కే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌ అన్నా రు. గురువారం చండూరులో లబ్ధిదారులకు నూ తనంగా మంజూరైన ఆసరా పింఛన్లను ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే చిరు మర్తి లింగయ్యలతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ సబ్బండ వర్గాల ప్రజల సంక్షేమమలే లక్ష్యంగా కేసీఆర్‌ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు అందిస్తున్న స్వచ్ఛమైన మిషన భగీరథ నీటితోనే ఫ్లోరిన మహమ్మారిని నుంచి విముక్తి కలిగిందని అన్నారు. ఆరేళ్ల కాలంలో ఒక్క ఫ్లోరిన కేసు కూడా నమోదు కాలేదని కేంద్రప్ర భుత్వం అంగీకరించిందన్నారు. ప్రతిపక్ష పార్టీలో ఉండి మరో ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లి మునుగోడు నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. సమావేశంలో మునిసిపల్‌ చైర్మన తోకల చంద్రకళవెంకన్న, మార్కెట్‌ కమిటీ చైర్మన గుర్రం మాధవీవెంకట్‌రెడ్డి, మునిసిపల్‌ కమిషనర్‌ వెంకట్రాం, కౌన్సిలర్లు కోడి వెంకన్న, శేఖర్‌, యాదయ్య, కీర్తిసంజయ్‌, నాయకులు వెంకన్న పాల్గొన్నారు.



Updated Date - 2022-08-19T06:26:27+05:30 IST