కేసీఆర్ మోసం చేయని వర్గం లేదు: షర్మిల

ABN , First Publish Date - 2022-03-21T00:38:08+05:30 IST

కేసీఆర్ మోసం చేయని వర్గం లేదు: షర్మిల

కేసీఆర్ మోసం చేయని వర్గం లేదు: షర్మిల

నల్గొండ: సీఎం కేసీఆర్ మోసం చేయని వర్గం లేదని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగ నోటిఫికేషన్ లేక నిరుద్యోగులు.. చిన్నచిన్న పనులు చేసుకుంటున్నారని తెలిపారు. ప్రతిభగల యువత కూలీ పనులకు వెళ్తున్నారని వాపోయారు. ఉద్యోగాల భర్తీకి 9 నెలలు ఎందుకు పడుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబానికి పదవులు ఇచ్చినప్పుడు ఎంత టైం పట్టింది? అని ప్రశ్నించారు. సున్నా వడ్డీ రుణాలని మహిళలను మోసం చేశారని దుయ్యబట్టారు. భృతి ఇస్తానని నిరుద్యోగులను మోసగించారని, దళితులకు 3 ఎకరాలు ఇస్తానని మాటతప్పారని మండిపడ్డారు. కేసీఆర్ తన కుటుంబానికి మాత్రమే మంచి చేశారని ఆరోపించారు. ఉద్యమకారుడని రెండుసార్లు అధికారం ఇస్తే ఒక్క మంచి పనైనా చేశారా అని నిలదీశారు. నీళ్లు, నిధులు, నియామకాలన్నీ కేసీఆర్ కుటుంబానికేనని షర్మిల అన్నారు.

Updated Date - 2022-03-21T00:38:08+05:30 IST