TS News: సంస్కరణల పేరుతో శఠగోపం - వికారాబాద్‌ బహిరంగసభలో కేంద్రంపై కేసీఆర్ ఘాట విమర్శలు

ABN , First Publish Date - 2022-08-16T23:47:57+05:30 IST

Vikarabad: సీఎం కేసీఆర్ (CM KCR) వికారాబాద్‌ బహిరంగసభలో కేంద్రంపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనైనా అమలవుతున్నాయా? అని ప్రశ్నించారు. వికారాబాద్‌లో కొత్త కలెక్టరేట్ (Collectorate)ను ప్రారంభించాక బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు.

TS News: సంస్కరణల పేరుతో శఠగోపం - వికారాబాద్‌ బహిరంగసభలో కేంద్రంపై కేసీఆర్ ఘాట విమర్శలు

Vikarabad: సీఎం కేసీఆర్ (CM KCR) వికారాబాద్‌ బహిరంగసభలో కేంద్రంపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనైనా అమలవుతున్నాయా? అని ప్రశ్నించారు. వికారాబాద్‌లో కొత్త కలెక్టరేట్ (Collectorate)ను ప్రారంభించాక బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. 


‘‘తెలంగాణ ఏర్పడకపోతే వికారాబాద్ జిల్లా అయ్యేదా? ఇచ్చిన మాట ప్రకారం వికారాబాద్‌ను జిల్లాగా చేశాం. రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు పడిపోయాయని ప్రచారం చేశారు. కర్ణాటక, ఏపీలో కంటే భూముల ధరలు తెలంగాణలో ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణలో ఒక్క ఎకరా అమ్మితే ఏపీలో మూడు ఎకరాలు కొనొచ్చు. సరిహద్దు పంచుకుంటున్న కర్ణాటక వాసులు తెలంగాణలో కలవాలని కోరుకుంటున్నారు. తమ రాష్ట్రంలో కూడా తెలంగాణాలో లాగా సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతున్నారు. 


కొత్త పింఛన్లు

కొత్తగా 10 లక్షల పింఛన్లు ఇవ్వడం ప్రారంభించాం. రైతు బీమా కింద రూ. 5 లక్షలు ఇస్తున్నాం. ప్రాజెక్టులు ఉన్న చోట పన్ను లేకుండా నీళ్లు ఇస్తున్నాం. రైతు బంధు, రైతు బీమా పక్కగా అమలవుతున్నాయి. నాణ్యమైన కరెంటు ఇస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. తాగునీరు, సాగునీరు, కరెంటు సమస్యలు లేవు. దేశంలో పంట పెట్టుబడి తీసుకుంటున్నది తెలంగాణ రైతు మాత్రమే. రైతు భీమా అందిస్తున్నఏకైక రాష్ట్రం తెలంగాణనే. గతంలో అనుభవించిన బాధాలు రావద్దంటూ రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. 


దేశ ప్రధానినే ప్రశ్నించా.

తెలంగాణ కోసం దేశ ప్రధానినే ప్రశ్నించా. నిత్యావసరాలు, ఇంధన ధరల పెంపుతో ప్రజలపై భారం మోపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పాలన ఒక్కసారి చూడండి. ఎనిమిదేళ్ల పాలనలో మోదీ చేసిందేమిటి? కేంద్రంలోని బీజేపీ ఏ ఒక్క మంచి పని చేసింది? మేలు చేయకపోగా.. రద్దు చేయాలని ఆదేశిస్తారు. సంస్కరణల పేరుతో మనకు శఠగోపం పెట్టి షావుకార్ల జేబులు నింపుతున్నారు. ఉచిత పథకాలు రద్దు చేయమని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. పెద్దపెద్ద వ్యాపారులకు రూ. 20 లక్షల కోట్లు ఎన్‌పీఏలు ఇచ్చారు. బీజేపీ జెండాను చూసి మోసపోతే శఠగోపం పెడతారు. ఉచిత కరెంటు వద్దంటున్న కేంద్రం బడా వ్యాపారులకు లక్షల కోట్లు మాఫీ చేసింది. బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. అన్ని రంగాల్లో తెలంగాణ పురోభివృద్ధి సాధిస్తుంది. రాజకీయ చైతన్యం లేని సమాజం దోపిడీకి గురవుతుంది. గతానికి, ఇప్పటికి వచ్చిన తేడాను గమనించాలి. రాష్ట్రం బాగుంటే సరిపోదు.. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వచ్చిన తెలంగాణను గుంటనక్కల పాలు కాకుండా చూడాలి.’’ అని సమావేశం ముగించారు. 

Updated Date - 2022-08-16T23:47:57+05:30 IST